మామిడికాయ చిత్రాన్నము (Mango Rice)
|
|
కావలసిన పదార్ధాలు: బియ్యము--3 గ్లాసులు |
విధానము :
1.3 గ్లాసుల అన్నము పొడి పొడి గా వాడ్చుకోవాలి.
2.మామిడికాయను తురుము కోవాలి.(1 కప్ మామిడికాయ తురుము,3 కప్పుల అన్నానికి సరిపోతుంది).
3.జీడిపప్పు నెయ్యి లో వేయించుకోవాలి.
4.వేరుశనగ విత్తనాలు కూడా వేయించుకోవాలి.
5 పచ్చిమిర్చి,అల్లము,1/4 స్పూన్ ఆవాలు గ్రైండ్ చేసుకోవాలి.
6.వేడివేడి అన్నముల,పసుపు వేసి,దానిపైన గ్రైండ్ చేసిన పొడిను,
మామిడికాయ తురుము వేయాలి.
7.తరువాత బానలి లో నూనె పెట్టి 6 ఎండు మిరపకాయలు,1/2 స్పూన్
ఉద్దిపప్పు,శనగపప్పు,ఆవాలు, జీలకర్ర,చిటికెడు ఇంగువ,కరివేపాకు వేయాలి.
8.తరువాత వేయించిన జీడిపప్పు, వేరు శనగ విత్తనాలు వేసి,బాగా కలిసేలా కలుపుకోవాలి.
9.బాగ కలిపిన తరువాత కొత్తిమీర వేసి,కొద్ది సేపు మూసి వుంచాలి.
10.కాసేపు అయ్యాక తింటే అన్నము కు,మామిడికాయ రసం బాగా పట్టి,రుచిగా వుంటుంది.

