సగ్గు బియ్యం- పెరుగు వడలు (Sabudana Curd Vada)
|
|
కావలసిన పదార్థాలు: సగ్గు బియ్యం--1 కప్ పెరుగు --౩ స్పూన్స్ బియ్యప్పిండి--1/4 కప్ పచ్చి మిర్చి---2 లేక 3 అల్లం---చిన్న ముక్క కరివేపాకు--2 రెమ్మలు జీలకర్ర--1/4 స్పూన్స్ ఉప్పు---తగినంత ఇంగువ—చిటికెడు బ్లాక్ సాల్ట్---1/4 స్పూన్స్ నూనె---2 కప్ వేయించడానికి |
విధానము:
1.సగ్గుబియ్యం లో పెరుగు వేసి ,సగ్గు బియ్యం మునిగేలా నీరు వేసి, 2 లేక 3 గంటలు నానపెట్టాలి.2.తరువాత,పెరుగులో నానపెట్టిన సగ్గు బియ్యం, అల్లం, మిర్చి, కరివేపాకు వేసి మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేయాలి.
3.తరువాత గ్రైండ్ చేసిన పిండి గట్టి పడ్డానికి బియ్యప్పిండి వేసి పకోడి పిండి లా కలుపుకోవాలి.
4.తరువాత జీలకర్ర, ఇంగువ ,ఉప్పు వేసి బాగా కలపాలి.
5.తరువాత కలిపిన పిండిని చిన్న ఉంటగా చేసుకొని వడలా చేయాలి.
6.నూనె వేడికి పెట్టి, వేడి అయ్యాక వడలు వేసి రెండు వైపులా కొంచం కలర్ మారేలా వేయించాలి.
7.ఇలా వేయించిన సగ్గు బియ్యం వడలపై, బ్లాక్ సాల్ట్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది.
ఎంతో రుచిగా ఉండే పెరుగు సగ్గు బియ్య్యము వడ రెడి.

