సగ్గుబియ్యం పాయసము (Sabudana Payasam)
|
|
కావలసిన పదార్థాలు:
సగ్గుబియ్యం---1 కప్
(1 గంట నాన పెట్టుకోవాలి)
నీరు --1 1/2 కప్
చెక్కర -- 1/2 కప్
పాలు ---1/2 కప్
నెయ్యి ---2స్పూన్స్
జీడిపప్పు --10
ద్రాక్ష--10
ఏలకులపొడి --1/2 స్పూన్
విధానము:
1.కొంచము నెయ్యి వేసి, జీడిపప్పు, ద్రాక్ష వేయిచుకోవాలి.
2.స్టవ్ పైన కొంచము నీరు పెట్టి బాగా మర్లినాక నానిన సగ్గుబియ్యము వేయాలి.
3.సగ్గుబియ్యము బాగా ఉడికినాక, చెక్కర వేయాలి.
4.తరువాత పాలు, నెయ్యి లో వేయించిన జీడిపప్పు,ద్రాక్ష వేయాలి
5.ఏలకుల పొడి కూడ వేయాలి.
ఎంతో రుచిగా వుండే సగ్గుబియ్యం పాయసం రెడి.
